భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందం! ..తర్వలోనే
భారత్-రష్యా దేశాల మధ్య రైలు విడిభాగాల తయారీకి సంబంధించి త్వరలోనే కీలక ఒప్పందం కుదరనుంది. రష్యా తన దేశీయ అవసరాలు తీర్చుకోవడం కోసం భారత్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని రైల్వే శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడిరచారు. లోకోమోటివ్, రైలు విడిభాగాలు తయారు చేసే ప్రముఖ సంస్థ ట్రాన్స్మాష్హోల్డింగ్ (టీఎంహెచ్) ఇందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. టీఎంహెచ్ సీఈవో కిరిల్ లిపా సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భారత్లో ప్రస్తుతం వడ్డీ రేట్లు ఇతర దేశాల కంటే భిన్నంగా ఉన్నాయి. కాబట్టే మేము అక్కడ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం. భారత్లో తయారు చేసిన వాటిని రష్యన్ మార్కెట్కు సరఫరా చేస్తాం. దీని ద్వారా భారత్లోని పలువురు సరఫరాదారులకు మాకు మధ్య ఉన్న సుదీర్ఘకాలంగా సంబంధాలు మరింత మెరుగుపడటంతో పాటు రష్యాకు సైతం దిగుమతులు పెరుగుతాయని పేర్కొన్నారు.






