అమెరికా కీలక ప్రకటన.. కాల్పుల విరమణకు

ఇజ్రాయెల్-పాలస్తీని మధ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోండని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయిల్ ఆపదర్మ ప్రధాని నెతన్యా హుకు ఫోన్ సంభషణలో చెప్పారు. డెమోక్రటిక్ పార్టీలోని వాళ్ళు కూడా కాల్పుల విరమణనను కోరుకుంటున్నారు. బైడెన్ కొంత కాలంగా ఇజ్రాయిల్ను బలపర్చడాన్ని తప్పు పడుతున్నా దానితో బైడెన్ కాల్పుల విరమణకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. అయితే అదే దాడుల నుండి ఆత్మ రక్షణ కోసం కూడా చర్యలు తీసుకోవాలని చెపుతున్నారు. ఇజ్రాయిల్ ప్రధాని మాత్రం పూర్తి స్థాయిలో దాడులు చేయడం తప్పదని చెపుతున్నారు.
మేం 10 నుంచి జరుగుతున్న దాడులలో ఇప్పటి వరకు 212 మంది చనిపోయారు. అందులో 61 మంది పిల్లలు ఉన్నారు. వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణభయంతో అక్కడి నుంచి వెళ్ళి పోతున్నారు. అమెరికా సైనిక జనరల్ మార్క్ మళ్ళి దాడులు కొనసాగితే మరింత అనిచ్చిత పరిస్థితులు ఏర్పడుతాయని అది గాజాకి నష్టం అని ఏ ఒక్కరికీ దీని ప్రయోజనం ఉండదని చెప్పారు. అందుకోసం ఆయన నాటో సభ్యులతో చర్చించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దాడులను తగ్గించుకోవడమే అందరికీ మేలని ఆయన అభిప్రాయపడ్డారు.