Georgia: జార్జియా అధికారుల తీరుపై భారతీయ మహిళ ధ్వజం

జార్జియా (Georgia) పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకులతో అక్కడి అధికారులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారని ఓ మహిళ ఆరోపించారు. తమను గంటల తరబడి జంతువుల్లా రోడ్డు పక్కన ఫుట్పాత్ (Footpath) పై కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మేనియా (Armenia) నుంచి 56 మంది పర్యాటకులతో కూడిన బృందం సడఖ్లో సరిహద్దు వద్ద జార్జియాలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో తమకు ఎదురైన అనుభవాలను బాధితురాలు ధ్రువీ పటేల్ (Dhruv Patel) సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమవద్ద ఈ-వీసాలు, చెల్లుబాటయ్యే అన్ని ధ్రువపత్రాలు ఉన్నప్పటికీ అవమానాలతో పాటు నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఆ సమయంలో ఆహారం ఇవ్వకపోగా, టాయ్లెట్కు కూడా వెళ్లనీయలేదని మండిపడ్డారు. రెండు గంటలకు పైగా తమ పాస్పోస్టు (Passport) లు స్వాధీనం చేసుకోవడంతో పాటు నేరస్థుల్లాగా తమను వీడియోలు తీశారని తెలిపారు.