RFC: రామోజీ ఫిల్మ్ సిటీలో “శ్రీమద్ భాగవతం పార్ట్-1” ఫిల్మ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం

ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy).
హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి తదితరులు.
సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఆకాష్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న “శ్రీమద్ భాగవతం పార్ట్-1”.
“శ్రీమద్ భాగవతం పార్ట్-1” ఫిల్మ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్…
దేశంలోనే రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City) ఒక యూనిక్ ఫిల్మ్ సిటీ.. అలాంటి రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణలో ఉండటం మనకు గర్వకారణం. శ్రీమద్ భాగవతం సినిమా తీయాలన్న ఆలోచన వచ్చినందుకు సినిమా టీమ్ ను అభినందిస్తున్నా. ఆనాడు నలభై ఏళ్ల క్రితం రామాయణం సీరియల్ రామాయణాన్ని అందరికీ చేరువ చేసింది. కోవిడ్ టైమ్ లో మళ్లీ రామాయణం సీరియల్ ను టెలికాస్ట్ చేస్తే ప్రపంచ రికార్డు సృష్టించింది.
2035 లోగా తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమిగా తీర్చి దిద్దాలని మేం సంకల్పించాం. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమిగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందుకోసం 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకుంటున్నాం.. 2047 విజన్ డాక్యుమెంట్ లో సినిమా రంగానికి ఒక ప్రత్యేక చాప్టర్ ఉంటుంది. ఆనాడు రామానంద్ సాగర్ తీసిన రామాయణం సీరియల్ ఎంత పాపులర్ అయిందో.. శ్రీమద్ భాగవతం పార్ట్-1 సినిమా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నా
మూవీ టీమ్ కు నా అభినందనలు.