ఆర్బీఐ కీలక నిర్ణయం… కీలక వడ్డీ రేట్లలో

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రెండు నెలలకు ఒకసారి నిర్వహించే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 4శాతంగా, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మానిటరీ పాలసీ కమిటి (ఎంపీసీ) సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు (ఎంఎస్ఎఫ్), బ్యాంకు రేట్లు కూడా 4.25 శాతంగా కొనసాగుతాయని చెప్పారు. రెపో రేటులో ఆర్బీఐ ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఆరోసారి. కాగా, 2022 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు అంచనాను 9.5 శాతానికి ఆర్బీఐ తగ్గించింది. గతంలో ఇది 10.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇక తొలి త్రైమాసికం జీడీపీ వృద్ధి రేటును గతంలో 26.2 శాతంగా అంచనా వేసినా.. తాజాగా దానిని 18.5 శాతానికి తగ్గించింది.