వేలంలో భారీ ధర పలికిన వజ్రం… ఎంతో తెలుసా?

వజ్రాలు అతి విలువైనవి అనేది అందరికి తెలిసిన విషయమే. వేలం పాటలో ఇవి కోట్ల రూపాయల ధర పలుకుతాయి. తాజాగా పర్పుల్-పింక్ డైమండ్ ది సాకురా కూడా భారీ ధర పలికింది. ఆ డైమండ్ను హాంగ్కాంగ్లో వేలం వేయగా రూ.213 కోట్లు (29.3 మిలియన్ డాలర్లు) పలికింది. 15.81 క్యారెట్ల ఈ డైమండ్ను ఆసియాలో ఓ బడా వ్యాపారి సొంతం చేసుకున్నారు. జెనీవాలో గత నవంబర్లో ది సాకురా అనే 14.8 క్యారెట్ల పర్పుల్-పింక్ డైమండ్ ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్ వేలంలో 27 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అలాగే దోషనివారణ ఓవల్ రత్నం ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్ 23 మిల్లియన్ డాలర్లు పలికినట్లు సమాచారం. ది సాకురా తో పాటు, గుండె ఆకారంలో ఉన్న మరో 4.2 క్యారెట్ల గులాబీ వజ్రాల ఉంగరాన్ని 6.6 మిలియన్ డాలర్లకు ది స్వీట్ హార్ట్ పేరుతో వేలం వేశారు. దీనిపై క్రిస్టీ వేలం సంస్థ స్పందిస్తూ.. ఈ రోజు ఆభరణాల వేలం చరిత్రలో మరో ముఖ్యమైన అధ్యాయాన్ని ది సాకురా నమోదు చేసింది. వేలంలో రికార్డ్ స్థాయిలో పలికిన ధర పట్ల మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఉత్తమ పింక్ వజ్రాలను అదించే క్రిస్టీ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని తెలిపింది.