ASBL NSL Infratech

శ్రీవారి భక్తులకు తెలంగాణ టూరిజం శుభవార్త.. ఒక్క రోజులోనే

శ్రీవారి భక్తులకు తెలంగాణ టూరిజం శుభవార్త.. ఒక్క రోజులోనే

తెలంగాణలోని శ్రీవారి భక్తులకు తెలంగాణ టూరిజం శాఖ శుభవార్త చెప్పింది. తిరుపతికి సంబంధించి వన్‌డే టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా బుక్‌ చేసుకునే ప్రయాణికులకు ఒక్క రోజులోనే విమానంలో తీసుకు వెళ్లి ప్రత్యేక దర్శనం చేయించి తిరిగి అదే రోజు హైదరాబాద్‌కు చేరుస్తుంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. ఈ టూర్‌ ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి రూ.12,499గా నిర్ణయించారు. హైదరాబాద్‌లో ఉదయం 6:55 గంటలకు ప్లయిట్‌ ఎక్కితే 8గంటలకు రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో తిరుపతి హోటల్‌లకు చేరుకుని ఫ్రెషప్‌ అయిన తర్వాత కారులో తిరుపతికి బయల్దేరుతారు. మధ్యాహ్నం 1 గంటలలోపు తిరుమలలో శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుంటారు. అనంతరం తిరిగి తిరుపతికి బయల్దేరుతారు. గంట విశ్రాంతి తీసుకున్న తరువాత పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అటు నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.అనంతరం సాయంత్రం 6:35 గంటలకు రేణిగుంట నుంచి ఫ్లయిట్‌ రాత్రి 7:45 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు.  కాగా తిరుపతి వన్‌డే ఫ్లయిట్‌ టూర ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి రూ.12.499గా నిర్ణయించారు. ప్యాకేజీలో ప్లయిట్‌ టికెట్‌, కారు ట్రావెల్‌ చార్జీలు, రెండు చోట్ల ప్రత్యేక దర్శనాలు ఉంటాయని తెలంగాణ టూరిజయం శాఖ అధికారులు పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :