శ్రీవారి భక్తులకు తెలంగాణ టూరిజం శుభవార్త.. ఒక్క రోజులోనే
తెలంగాణలోని శ్రీవారి భక్తులకు తెలంగాణ టూరిజం శాఖ శుభవార్త చెప్పింది. తిరుపతికి సంబంధించి వన్డే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా బుక్ చేసుకునే ప్రయాణికులకు ఒక్క రోజులోనే విమానంలో తీసుకు వెళ్లి ప్రత్యేక దర్శనం చేయించి తిరిగి అదే రోజు హైదరాబాద్కు చేరుస్తుంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. ఈ టూర్ ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి రూ.12,499గా నిర్ణయించారు. హైదరాబాద్లో ఉదయం 6:55 గంటలకు ప్లయిట్ ఎక్కితే 8గంటలకు రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో తిరుపతి హోటల్లకు చేరుకుని ఫ్రెషప్ అయిన తర్వాత కారులో తిరుపతికి బయల్దేరుతారు. మధ్యాహ్నం 1 గంటలలోపు తిరుమలలో శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుంటారు. అనంతరం తిరిగి తిరుపతికి బయల్దేరుతారు. గంట విశ్రాంతి తీసుకున్న తరువాత పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అటు నుంచి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.అనంతరం సాయంత్రం 6:35 గంటలకు రేణిగుంట నుంచి ఫ్లయిట్ రాత్రి 7:45 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. కాగా తిరుపతి వన్డే ఫ్లయిట్ టూర ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి రూ.12.499గా నిర్ణయించారు. ప్యాకేజీలో ప్లయిట్ టికెట్, కారు ట్రావెల్ చార్జీలు, రెండు చోట్ల ప్రత్యేక దర్శనాలు ఉంటాయని తెలంగాణ టూరిజయం శాఖ అధికారులు పేర్కొన్నారు.