పిఠాపురం నివాసం నుంచి కదిలిన పవన్ పొలిటికల్ ర్యాలీ..
జనసేనాని..పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి పవన్ కల్యాణ్ సోమవారం నాడు పిఠాపురంలోని తన నివాసం నుంచి ఎన్నికల ర్యాలీ ప్రారంభించారు. నాన్ లోకల్ అంటూ తనపై వచ్చిన విమర్శలకు స్పందించిన పవన్ పిఠాపురంలోనే తన నివాసాన్ని ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. ఉదయం 11 ప్రాంతంలో జనసేనాని కార్ లో బయలుదేరడంతో ర్యాలీ మొదలైంది. పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు నినాదాలు చేస్తూ అతని వెంట నడిచారు.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పవన్ ఇప్పుడు పిఠాపురం పై తన పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టబోతున్నారట. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి ఓటమి చవిచూసిన పదం ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా పిఠాపురంలో గెలవాలి అని బలంగా ప్రయత్నిస్తున్నారు. ఇక పవర్ స్టార్ కోసం మెగా కుటుంబం కూడా మెల్లిగా ప్రచారంలోకి దిగుతోంది. నిన్న వరుణ్ తేజ్ బాబాయ్ కు మద్దతుగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో మెగాస్టార్ కూడా తమ్ముడి కోసం పిఠాపురంలో ప్రచారం చేస్తారు అన్న వార్త వినిపిస్తోంది. అయితే ఇంకా ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి స్పష్టత లేదు.