మిడ్మానేరు జలాశయానికి సీఎం కేసీఆర్ పూజలు
కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ మిడ్మానేరు (రాజరాజేశ్వర) జలాశయాన్ని పరిశీలించారు. కాళేశ్వరం జలాలతో నిండిన జలాశయానికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. వేములవాడ రాజన్న దర్శనం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా మిడ్మానేరు సందర్శనకు వెళ్లారు. జలాశయం పర్యటన అనంతరం తీగలగుట్టపల్లికి కేసీఆర్ వెళ్లారు. సీఎం పర్యటనలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Tags :