Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Religious » Ttd launch indias first ai integrated command control centre

Tirumala: తిరుమలలో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసి) ఏర్పాటు

  • Published By: techteam
  • September 26, 2025 / 02:58 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Ttd Launch Indias First Ai Integrated Command Control Centre

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమల (Tirumala) కు వస్తుంటారు. నిత్యం భక్తులతో రద్దీగా దర్శనమిచ్చే తిరుమల క్షేత్రంలో ఎప్పటికప్పుడు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భక్తులకు సమగ్రమైన సేవలు అందించేందుకు టిటిడి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో మరింతగా భక్తలకు సౌకర్యాలను కల్పించే దిశగా, అదేవిధంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ఎక్కడా ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో అమెరికాలోని ఎన్నారైల దాతృత్వంతో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ సేవలను తిరుమలలో అందుబాటులోకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్‌ తీసుకువచ్చింది. దేశంలోనే తొలిసారిగా తిరుమల పుణ్యక్షేత్రంలో ఏఐ సేవలలో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ICCC)ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Telugu Times Custom Ads

గత అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఐటి, విద్య శాఖల మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు బే ఏరియాలో ఉన్న తెలుగు ఐటీ ఎంట్రప్రెన్యూరర్‌గా ఉన్న వేజెళ్ళ, ఇతర ఎన్నారైలు తిరుమలలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సిస్టమ్‌ గురించి వివరించారు. తిరుమలలో ఈ ఏఐ టెక్నాలజీపై ఫిబ్రవరిలో పవర్పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. పూర్తిగా డొనేషన్‌ ప్రాతిపదికగా తామే దీనిని స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారు. అనంతరం వారు టిటిడితో ఒప్పందం చేసుకున్నారు.

తిరుమల క్షేత్రంలో వైకుంఠం-1 కాంప్లెక్స్‌లో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ స్థానంలో సుమారు 30 కోట్లతో అత్యాధునిక పద్ధతుల్లో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టిటిడిలో దీన్ని తొలిసారిగా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎన్‌ఆర్‌ఎల దాతృత్వంతో తిరుమల వైకుంఠం-1లో దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. దీనిద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, తదితర సౌకర్యాలకు అనుగుణంగా భద్రతను పెంపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లో పెద్ద డిజిటల్‌ స్క్రీన్‌ పై అన్ని విభాగాలకు చెందిన సిసిటీవి ఫుటేజీలు కనిపిస్తాయి. వీటిని 25మందికి పైగా సాంకేతిక సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులకు వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. ప్రస్తుతం ఉన్నవాటితో పాటు కొత్తగా అమర్చిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి వద్ద నుండే భక్తుల రద్దీని ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ అంచనా వేస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది భక్తులు ఉన్నారు. ఎంత సమయంగా వారు నిరీక్షిస్తున్నారు. సర్వదర్శనం కోసం వచ్చిన భక్తుల పరిస్థితి ఏమిటి.. తదితర అంశాలను ఏఐ ట్రాక్‌ చేస్తుంది. ఫేస్‌ రికగ్నేషన్‌ సాంకేతికత ద్వారా భక్తులను గుర్తిస్తుంది. చోరీలు, ఇతర అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా కనిపెడుతుంది. తప్పిపోయినవారు ఎక్కడ ఉన్నారో తెలియజేస్తుంది.

భక్తుల ముఖకదలికలు ఆధారంగా వారి ఇబ్బందులను తెలియజేస్తుంది. క్యూలైన్లు, వసతి, ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో త్రీడి మ్యాప్‌ చిత్రాలతో చూపుతుంది. రద్దీ ఉన్న ప్రాంతాలను రెడ్స్పట్లుగా చూపడంతో పాటు తగిన చర్యలకు సంకేతాలు ఇస్తుంది. ఆన్‌లైన్‌లో నిరంతరం పర్యవే క్షిస్తూ సైబర్‌ దాడులు, టిటిడి ప్రతిష్ఠను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాలలో పెట్టే అనుచిత పోస్టులు, ఆన్లైన్లో తప్పుడు సమాచారాలను అడ్డుకుంటుంది.

ఎప్పటికప్పుడు భక్తుల అనుభవాలను తెలుసుకుని, శ్రీవారి దర్శనాలను మరింత సౌకర్యవంతంగా చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితులలో భక్తులను బయటకు తీసుకువచ్చే సమీప మార్గాలను చూపుతుంది. ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల ఈ కేంద్రాన్ని ప్రారంభించి ఎన్నారైలను అభినందించారు.

ఐసీసీసి ఏర్పాటు వెనుక…

ఇంటిగ్రేటెడ్‌ కామాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ) సాంకేతిక పరిజ్ఞానం` సనాతన ధర్మం కలయికగా చెప్పవచ్చు. ఈ ఐసీసీసి వెనుక ఎన్నారైల దాతృత్వం, శ్రమ, ముఖ్యంగా బే ఏరియాలో ఎంట్రప్రెన్యూరర్‌గా ఉన్న శ్రీ వేజెండ్ల కృషి ఎంతో ఉంది.

  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్‌ తన అమెరికా పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలోని సిలికాన్‌ వ్యాలీలో ఫాల్కన్‌ ఎక్స్‌ సెంటర్‌ లో ఉన్న కొన్ని స్టార్టప్‌ కంపెనీలను, కొంతమంది ఐటీ నిపుణులను కలిశారు. అప్పుడు ఆయన దృష్టికి వచ్చిన ఒక ఎఐ ఆధారిత క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ఐడియాను తిరుమల తిరుపతిలో భక్తులకు అనుసంధానం చేయడం వల్ల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సూచన చేశారు.
  • ఐటీ రంగ నిపుణులు, ఎంట్రప్రెన్యూరర్‌గా ఉన్న జే.పి. వేజండ్ల ఆ సూచన ప్రకారం ఈ ప్రోగ్రామ్‌ ను ఏ విధంగా అనుసంధానం చేయగలమా, చేస్తే ఎలా చేయాలి అని దానిమీద బాగా స్టడీ చేశారు. తరువాత దానిని కార్యరూపంలోకి తీసుకురావాల నుకున్నారు. ఫిబ్రవరి 2025లో ఇండియా వచ్చి తిరుమల చేరుకొని టీటీడి బోర్డ్‌ చైర్మన్‌ బి.ఆర్‌. నాయుడు గారితో చర్చలు జరిపారు. తరువాత జేఈవో శ్రీ వెంకయ్య చౌదరి నుంచి తమకు కావాల్సిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు.
  • అమెరికాలో ఉన్న కార్య ఫౌండేషన్‌ (లాభాపేక్ష లేని 501(సి) సంస్థ ద్వారా ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు (దాదాపు రూ.30 కోట్లు) సమకూర్చుకుంటూ అనేక మంది ఐటీ నిపుణుల తోను ఐటీ సంస్థలతోనూ మాట్లాడి వారి సహకారం తీసుకొంటూ ఈ ఎఐ ఆధారిత ప్రోగ్రామ్‌ను రూపొందించారు.
  • హైదరాబాద్‌లో ఉన్న ఎక్విప్‌ సోషియల్‌ ఇంపాక్ట్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ పిపిపి (పబ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్‌) మీద, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో పనిచేస్తున్న సంస్థల సహకారం తీసు కొని ఈ ప్రోగ్రామ్‌ను కార్యరూపంలోకి తీసుకు వచ్చారు. ఈ ప్రోగ్రామ్‌ కోసం వేజెళ్ళతో పాటు, కొందరు ఎన్‌ఆర్‌ఐలు, వారి ఆఫీసు సిబ్బంది దాదాపు మూడు వారాలు శ్రమించి అనేక విధాలుగా పరీక్షలు జరిపి సిస్టమ్‌ ను రెడీ చేశారు.
  • దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చుతో ఒక సంవత్సరం పైగా శ్రమించి నిర్మించిన ఈ ప్రాజెక్టును అమలు చేయడంలో శ్రీ జెపి. వేజెండ్ల, శ్రీ అనురాగ్‌ జ్కెస్‌, శ్రీ శ్రీనిరాజు, శ్రీ బీ.వీ జగదీప్‌, శ్రీ ప్రవీన్‌ అక్కిరాజు, శ్రీ రాజు ఇందుకూరి, శ్రీ రవి అక్కిరెడ్డి కీలకపాత్ర పోషించారు.

 

 

 

Tags
  • Chandrababu
  • governor
  • ICCC
  • Lokesh
  • Tirumala

Related News

  • Koneru Hampi Receives Dhairya Award From Venkaiah Naidu

    Koneru Hampi: కోనేరు హంపికి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా “ధైర్య” పురస్కారం

  • Vishwaveda Parayana Celebrated In Houston

    VVPB: హ్యూస్టన్‌ లో ఘనంగా విశ్వవేద పారాయణ వార్షికోత్సవం.. 500మందికి పైగా పాల్గొన్న భక్తులు

  • Cm Chandrababu Family Visits Vijayawada Kanaka Durgamma Temple

    Chandrababu: కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ.. అంతా వారి మహిమే అన్న చంద్రబాబు..

  • Cm Chandrababu Naidu And His Wife Offer Silk Robes To The Lord Sri Venkateswara In Tirumala

    CBN: స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబునాయుడు దంపతులు

  • Spiritual Guru Acyuta Gopis Virtual Press Meet With Hyderabad Media

    Acyuta Gopi: ఆధ్యాత్మిక గురువు అచ్యుత గోపి వర్చువల్​ మీడియా సమావేశం

  • Sri Paripurnananda Giri Swami Impressed With The Teachings Of The Gita

    గీత బోధనలతో ఆకట్టుకున్న శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి

Latest News
  • Uttara: ‘ఉత్తర’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
  • Ugly Story: నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న ‘అగ్లీ స్టోరీ’ ఇంటెన్స్ టీజర్ విడుదల
  • Abhiram: శ్రీమతి అనురాధ దేవి సమర్పణలో అభిరామ్ చిత్రం
  • Mawa Movie: ”మావా” చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం
  • Sri Chakram: TG విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, ఓంకార్ రాజు గారి గది 4 “శ్రీచక్రం” అనౌన్స్‌మెంట్
  • Chaitanya Rao: చైతన్య రావు హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
  • Maha Shakthi: నయనతార, సుందర్ సి ‘మహాశక్తి’ ఫస్ట్ లుక్
  • Purusha: పవన్ కళ్యాణ్ హీరోగా కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘పురుష:’ చిత్రీకరణ పూర్తి
  • Anumana Pakshi: విమల్ కృష్ణ ‘అనుమాన పక్షి’, టైటిల్, ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్
  • TVK Vijay: విజయ్‌కి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్ట్..!
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer