ప్రతి నెలా మొదటి మంగళవారం… స్థానికులకు: టీటీడీ

తిరుపతిలోని స్థానికులకు తిరుమల శ్రీనివాసుడి దర్శనాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి ఇటీవల పునరుద్ధరించింది. ఈ క్రమంలో డిసెంబర్ 1న తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి నవంబర్ 18న జరిగిన తొలి సమవేశంలో ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 3న (మొదటి మంగళవారం) స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి టోకెన్లు పొందవచ్చని టీటీడీ తెలిపింది.