తెరచుకున్న శబరిమల ఆలయం

మండల`మకరవిళక్క సీజనులో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరచుకుంది. శనివారంతెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు. తొలిరోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు సమాచారం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్లో దర్శన సమయాలను పొడిగించినట్లు ట్రాన్వెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.