London:లండన్లో తెలుగు యువకుడి మృతి

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి (Mahender Reddy) (26) లండన్లో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన రెండు సంవత్సరాల క్రితం పీజీ చేసేందుకు లండన్ వెళ్లి ఇటీవలే పూర్తి చేశారు. వర్క్ వీసా (Work visa) కూడా వచ్చింది. మహేందర్ రెడ్డి తండ్రి రమేశ్ రెడ్డి (Ramesh Reddy) కాంగ్రెస్ పార్టీ మేడిపల్లి మండల అధ్యక్షుడిగా ఉన్నారు. యువకుడి మృతి పట్ల ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పలువురు ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు.