Reventh: యాదాద్రి విద్యుత్ కేంద్రం రెండో యూనిట్ జాతికి అంకితం: సీఎం రేవంత్ రెడ్డి

యాదాద్రి విద్యుత్ కేంద్రం రెండో యూనిట్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జాతికి అంకితం చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్-2లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగుతుంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వైటీపీఎస్ పనులను కూడా సీఎం రేవంత్ (CM Revanth Reddy) పరిశీలించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద కృష్ణా నది సమీపంలో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఐదు యూనిట్లను ఈ కేంద్రంలో నిర్మిస్తున్నారు. అలాగే, వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఉన్న మెగా టెక్స్ టైల్ పార్కును రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడి వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. మెగా టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధి పనులను సమీక్షించారు. టెక్స్ టైల్ పార్క్ భూనిర్వాసితులకు డ్రా పద్ధతిలో ఇళ్ల పట్టాలను అందజేయనున్నారు. త్వరలోనే 863 మంది లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందించనున్నారు.