గాంధీ ఆసుపత్రిలో మరో చరిత్ర
కోవిడ్ 19 ఆసుపత్రి గాంధీ ఇప్పుడు మరో చరిత్రకు సిద్ధమైంది. కరోనా వైద్యం కోసమే ప్రత్యేకంగా కేటాయించిన గాంధీ ఆసుపత్రిలో నేటి నుంచి కరోనా మహమ్మారికి చికిత్సలో కీలకంగా భావిస్తున్న ప్లాస్మా థెరపీని మొదలుపెట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చీ (ఐసీఎంఆర్) అనుమతి పొందింది. కరోనా బారిన పడి వైద్యసేవల అనంతరం పూర్తి స్థాయిలో కోలుకున్న 35 మంది ప్లాస్మా దాతలు ముందుకురాగా, వారిలో ఆరుగురు కరోనా బాధితుల కేసు సీట్లు ఇతర వివరాలను ఐసీఎంఆర్కు పంపించారు. అక్కడి నుంచి వచ్చిన సూచనల మేరకు మొదటి విడతగా ముగ్గురికి ప్లాస్మా థెరఫీ చికిత్స ప్రారంభిస్తారు. ఆరోగ్యవంతుడైన కరోనా బాధితుల నుంచి 400 ఎం.ఎల్ ప్లాస్మాను సేకరించి 200 ఎం.ఎల్ ప్లాస్మాను బ్లడ్ గ్రూప్ ఆధారంగా రోగీ శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ పక్రియకు సుమారు 2 గంటల సమయం పడుతుంది.






