America: అమెరికాలో తెలంగాణ వాసి మృతి

అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడిన నిజామాబాద్ జిల్లా వాసి గుండెపోటుకు గురై మృతి చెందారు. వారాంతపు సెలవులను ఆస్వాదించేందుకు బోటింగ్కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిజామా బాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామానికి చెందిన వడ్లమూడి రాధాకృష్ణ, సరస్వతి దంపతుల కుమారుడు హరికృష్ణ(Harikrishna) (49). ఆయన 25 ఏళ్ల క్రితమే అమెరికాకు వెళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Software Engineer ) గా స్థిరపడ్డారు. ప్రస్తుతం వర్జినియా (Virginia) లో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య శిల్ప(Shilpa) , యుక్త, సరయు అనే ఇద్దరు ఆడ పిల్లలున్నారు. అయితే తన స్నేహితుడి కుటుంబంతో కలిసి అక్కడి ఓ నదిలో బోటింగ్కు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే హరికృష్ణ ఒక్కసారిగా గుండెపోటు (Heart attack) కు గురై నదిలో పడిపోయారు. స్నేహితుడి కూతురు నదిలో దూకి హరికృష్ణను ఒడ్డుకు చేర్చి సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది.