Sridharbabu: మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ ఈటల రాజేందర్ భేటీ

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి శ్రీధర్బాబు (Sridharbabu) ను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) కోరారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబు ఈటల రాజేందర్ కలిశారు. మల్కాజిగిరి పార్లమెంట్ (Malkajgiri Parliament ) నియోజకవర్గంలో తాగునీటి సరఫరా, రోడ్లు సరిగా లేవని, చెరువులు మురికి కూపాలుగా మారాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైడ్రా (Hydra) పేరిట డబ్బులు వసూలు చేస్తున్న బ్లాక్మెయిలర్లపై దృష్టి సారించాలని కోరారు. చిన్న దేవాలయాలను కూడా దేవదాయశాఖ పరిధిలోకి తీసుకురావడంతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నగరానికి నాలుగు వైపులా డంప్ యార్డులు ఉండాలని, చెత్తంతా బాలాజీనగర్ (Balajinagar) కు పంపిస్తే అక్కడి ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందన్నారు. అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని శ్రీధర్బాబును కోరారు. సమస్యల పరిష్కారం మంత్రి శ్రీధర్బాబు సానుకూలంగా స్పందించారని ఈటల తెలిపారు.