MLC Kavitha: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు 72 గంటల దీక్ష

బీసీ బిల్లు ఎంత అవసరమో దేశానికి చాటి చెప్పేందుకు ఆగస్టు 4, 5, 6, తేదీల్లో 72 గంటల దీక్ష చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీసీ బిల్లు (BC Bill) సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు దీక్ష చేయనున్నట్లు తెలిపారు. బీసీ బిల్లు సాధన విషయంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party ) కి చిత్తశుద్ధి ఉంటే, అన్ని పార్టీలతోవెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢల్లీికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఢల్లీిలో తలపెట్టిన ధర్నా కేవలం బిహార్ (Bihar) ఎన్నికలను దృష్టి పెట్టుకుని చేస్తున్న డ్రామా అని విమర్శించారు. బీసీ బిల్లు విషయంలో చేయాల్సిన పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ సాగదీత ధోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు. బీజేపీ (BJP) నేతలు బీసీలకు అండగా ఉండాల్సిన సమయంలో తప్పించుకొని తిరుగుతున్నారని విమర్శించారు.