KTR : ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అని డ్రామాలు : కేటీఆర్

కాంగ్రెస్ పాలనతో ఏ వర్గమూ సంతోషంగా లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్గల్లో నిర్వహించిన రైతు మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని ఆ పార్టీ నేతలు మళ్లీ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ మోసపోతే ఎవరూ కాపాడలేరన్నారు. కేసీఆర్ (KCR) హయాంలో రైతు రాజులా బతికాడు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీఎం అయ్యాక సోనియాగాంధీ (Sonia Gandhi) పుట్టినరోజు రెండుసార్లు వచ్చింది. కానీ రుణమాపీ 25 శాతం కూడా కాలేదు. 35 సార్లు ఢల్లీి విమానం ఎక్కారు. 35 ఫైసలూ తీసుకురాలేదు. అప్పులు కట్టలేదని రైతుల తలుపులు ఎత్తుకెళ్లారు. రేపో మాపో పుస్తెలతాడు కూడా లాక్కెళ్లిపోతారు. ఓట్ల కోం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలి. ఫోర్త్ సిటీ (Fourth City) , ఫ్యూచర్ సిటీ (Future City ) అని డ్రామాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి తెలియదు. సీం సొంత నియోజకవర్గం కొడంగల్తో పాటు సొంత ఊరు, అత్తగారి ఊరు కల్వకుర్తిలో ఏమైనా చేశారా? అని అడగడానికి ఇక్కడకు వచ్చాం. కులగణన పేరుతో బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేశారు అని ఆరోపించారు.