KTR: అన్ని యూనిట్లు ప్రారంభమైతే.. వరంగల్ ప్రధాన కేంద్రంగా

వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (Textile Park) లో ఉత్పత్తిపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ (KTR) హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి యూనిట్ ఉత్పత్తి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ మార్కెట్లకు టీషర్టులు (T-shirts) ఎగుమతి చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం హయాంలో 2023లో కాకతీయ టెక్స్టైల్ పార్కులో ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. 11 యంగ్ వన్ కార్పొరేషన్ ఫ్యాక్టరీలకు భూమిపూజ చేశామన్నారు. అన్ని యూనిట్లు ప్రారంభమైతే, వరంగల్ (Warangal) ప్రధాన వస్త్ర కేంద్రంగా మారుతుందని వివరించారు. వ్యవసాయం నుంచి ఫ్యాషన్ నినాదంతో టెక్స్టైల్ పార్కును స్థాపించినట్లు తెలిపారు.