సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు : కిషన్ రెడ్డి

సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్కు చెందిన పెద్దపల్లి ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచన కేంద్రానికి లేదని తెలిపారు. దేశంలో ఓ బొగ్గు గనినీ ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన లేదని వివరించారు. సింగరేణిని ప్రవేటుపరం చేయాలంటే, 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ప్రధానమని పేర్కొన్నారు.