అన్నమయ్యపురంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత డా శోభా రాజు గారి అధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శిష్యులు, భక్తులు, వాలంటీర్లు కలిసి దేశ భక్తి గీతాలు ఆలపించారు. సంస్థ వాలంటీర్ శ్రీ మతి లక్ష్మీ గారు త్రీవర్ణ పతాకాన్ని ఎగురవేశారు. విచ్చేసిన వారందరికీ చాక్లెట్లు మరియు ప్రసాదాన్ని పంచిపెట్టటంతో కార్యక్రమం ముగిసింది.