తెలంగాణలో హిందుస్థాన్ కోకాకోలా బేవరేజస్ సంస్థ Rs. 1000 కోట్ల పెట్టుబడులు
హిందుస్థాన్ కోకాకోలా బేవరేజస్ సంస్థ (హెచ్ సీ సీ బీ) తెలంగాణలో ₹1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఆహార శుద్ధి పార్క్ లో తమ రెండవ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీ కేటీఆర్ తో సమావేశం అనంతరం హెచ్సీసీబీ చైర్మన్ & సీఈఓ నీరజ్ గార్గ్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ఘన వ్యర్థాలు, వ్యర్థ జలాల నిర్వహణ, నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మరియు హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.






