Saraswati: సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తజనం

తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి పుష్కరాల (Saraswati Pushkarala) కు జనం పోటెత్తారు. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మద్దుపల్లి- కాళేశ్వరం (Kaleshwaram) మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాళేశ్వరానికి సమీపంలో 8 కి.మీ. మేర వాహనాలు స్తంభించాయి. 4 గంటలుగా ట్రాఫిక్ జామ్ (Traffic jam) కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగునీరు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ స్తంభించడంతో కొంతమంది ప్రయాణికులు కాలినడకన పుష్కర ఘాట్ల (Pushkara Ghat ) కు చేరుకున్నారు.