Revanth Reddy: ఐసీసీసీ లో ఏఐ హబ్, టీ స్క్వేర్ పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, టీజీఐఐసీ ఎండీ శశాంక, టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు.
సమీక్ష లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ….
టీ స్క్వేర్ ఐకానిక్ బిల్డింగ్ గా ఉండాలి.. నవంబర్ నెల చివరి వరకు టీ స్క్వేర్ పనులు ప్రారంభం కావాలి. టీ స్క్వేర్ నిర్మాణం లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.. టీ స్క్వేర్ లో ఆపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ ఔట్లెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.. యుటిలిటీ జోన్ ఏర్పాటు చేయాలి.. టీ స్క్వేర్ 24 గంటల పాటు పని చేయాలి.. ఏ ఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ లో భవనాలను పరిశీలించాలి. ఏ ఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి.. ఏ ఐ లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సంస్థ ల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలి..