Revanth Reddy: నాంపల్లి ఎమ్మెల్యే కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నికల ప్రచారానికి సంబంధించి తనపై నమోదైన కేసుల విచారణ కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాంపల్లి ఎంపీ/ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు. ఆయనపై మూడు పోలీస్ స్టేషన్లలో.. నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్, బేగంబజార్ పోలీస్ స్టేషన్, మెదక్ జిల్లాలోని కౌడిపల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ కోసమే ఆయన కోర్టుకు హాజరయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ.. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే కక్షపూరితగా ఈ కేసులు నమోదు చేసిందని కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణను వచ్చే నెల 23వ తేదీకి వాయిదా వేశారు.