తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ప్రజాభవన్లో ముఖాముఖి భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్కు చేరుకున్న చంద్రబాబుకు, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పుష్పగుచ్చం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం భేటీ అయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్యనేతలు సమావేశం వేదికైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొర చూపారు. హైదరాబాద్లో సమావేశమై రెండు సమస్యలను పరిష్కరించుకుందామని, సహకరించుకుంటూ ముందుకు సాగేందుకు ఈ భేటీ ఉపకరిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించడంతో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.