Arvind : కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే సర్పంచ్ ఎన్నికలు : ఎంపీ అరవింద్
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లు (BC Reservations) ఒక పొలిటికల్ డ్రామా అని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిజామాబాద్లో (Nizamabad) పలు కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం అరవింద్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలని పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) హామీలు అమలు చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని విమర్శించారు. పావలా వడ్డీకే కేంద్రం నిధులు ఇస్తోందని చెప్పుకొచ్చారు. కేంద్ర నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరగుతున్నాయని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని విమర్శలు చేశారు. రైల్వే పనులకు నిధులు విడుదల చేసిన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకి ధన్యవాదాలు తెలిపారు. రైల్వే పనులకు రేవంత్రెడ్డి ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే నిరాహార దీక్ష చేస్తానని తాను ప్రకటించానని గుర్తుచేశారు. నిజామాబాద్ జిల్లాలో 10 ఆర్వోబీలు పూర్తి చేయాలనేది తన టార్గెట్ అని పేర్కొన్నారు.






