బయో ఏషియా సదస్సును ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా (20వ) సదస్సును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) వేదికగా జరుగుతున్న ఈ సదస్సు నేటి నుంచి చూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్, నేషనల్ హెల్త్ అథారిటీ అదనపు సీఈవో బసంత్ గార్గ్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. మూడురోజులపాటు జరుగనున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి 2 వేలకు మందికి పైగా ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా లైఫ్ సైన్సెస్, ఫార్మా మెడ్టెక్, ఆరోగ్య సంరక్షణ రంగాలపై నిపుణుల ప్రసంగాలు, బృంద చర్చలు జరుగనున్నాయి. వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతిక సమావేశాలు, ప్రపంచ స్థాయి నిపుణులతో చర్చలు, ఇంటరాక్టివ్ సెషన్స్, సీఈవో కాంక్లేవ్, స్టార్టప్ పోకేస్, బయో ఫార్క్ సందర్శనలు తదితర కార్యక్రమాలు ఉంటాయి. రెండరోజుల పాటు లైఫ్సైన్సెస్, ఫార్మా, పరిశ్రమ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తారు. చివరిరోజు వివిధ కంపెనీలకు చెందిన ప్రదర్శన ఉంటుంది. జీనోమ్ వ్యాలీ ఎల్స్లెన్స్ అవార్డు ప్రదానోత్సవం నిర్వహిస్తారు.






