అప్పటి వరకు భక్తులను అనుమతించం
మే 31వ తేదీ వరకు దేవాలయాల్లో భక్తులను అనుమతించడం లేదని ఆంధప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సృష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం లాక్ డౌన్ కాలపరిమితిని మే నెల 31 వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నామని తెలిపారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అయితే అన్ని దేవాలయాల్లో యధావిధిగా నిత్య పూజలు, సాంప్రదాయం ప్రకారం కొనసాగుతాయన్నారు. అదేవిధంగా ఆర్జిత సేవల కోసం ఆన్లైన్ ద్వారా చెల్లింపు జరిపి పరోక్షంగా సేవలు అందించే విధంగా అన్ని దేవాలయాల్లో ఏర్పాటు చేసుకోవాలని కార్యనిర్వాహక అధికారులను ఆదేశించారు.






