Kanakamedala: అదనపు సొలిసిటర్ జనరల్ గా కనకమేడల రవీంద్ర కుమార్
సుప్రీంకోర్టు (Supreme Court)లో అదనపు సొలిసిటర్ జనరల్( ఎఎస్ జీ)గా సీనియర్ న్యాయవాది, రాజ్యసభ మాజీ సభ్యుడు, టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ (Kanakamedala Ravindra Kumar) నియమితులయ్యారు. ఆయన తోపాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు దవీందర్ పాల్సింగ్ (Davinder Pal Singh), అనిల్ కౌశిక్లకు కూడా ఎఎస్ జీలుగా అవకాశం లభించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురూ మూడేళ్లపాటు ఎఎస్ జీ (ASG)లుగా కొనసాగుతారని పేర్కొంది. ప్రస్తుతం, భారత అటార్నీ జనరల్గా వెంకట రమణి, సోలిసిటర్ జనరల్గా తుషార్ మెహతా ఉన్నారు. సుప్రీంకోర్టులో ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అత్యున్నత బాధ్యత అదనపు సొలిసిటర్ జనరల్దే కావడం విశేషం.






