ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ను కళాశాలల విద్యాశాఖ కమిషనర్గా బదిలీ చేశారు. ఏపీ టూరిజం ఎండీ ప్రవీణ్కుమార్ను ప్రకాశం జిల్లా కలెక్టర్గా బదిలీ చేసిది. ఎస్ సత్యనారాయణను ఏపీ టూరిజం ఎండీగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న పీ బసంత్కుమార్ను మున్సిపల్ శాఖలో ఎంఐజీ ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్గా నియమించి, ఏపీయూఎఫ్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్గా పూర్తి అదనపు బాద్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.