ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా పరీక్షలు…
కరోనా సంక్షోభం ప్రారంభమైన దగ్గర నుంచీ అత్యధిక పరీక్షలు చేయడం పైనే ప్రధానంగా దృష్టి పెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షల సంఖ్య ఏకంగా 2 లక్షల మైలురాయి ని చేరుకుంది. దేశంలోనే కరోనా పరీక్షల విషయం లో తాము ఫస్ట్ ప్లేస్ లో ఉన్నామని సీఎం జగన్ ప్రకటించారు.. ఏ నేపథ్యంలో ఏపీలో బుధవారం నాటికి కరోనా స్థితి గతులు అధికారులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి
తాజా కేసులు48…
గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 40, ఇతర రాష్ట్రాలవి 8 మొత్తం 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. దీనితో ఇప్పటి దాకా పాజిటివ్ ల సంఖ్య మొత్తం 2064, ఇతర రాష్ట్రాలవి 73తో కలిపి 2137.అని అధికారులు తెలిపారు.
ఇందులో వైద్య సేవలు పొందుతున్న కేసుల్లో రాష్ట్రానివి 875 , ఇతర రాష్ట్రాలవి 73 మొత్తం 948, డిశ్చార్జ్ అయిన వారు 1142 , మరణించిన వారు 47.
గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన మొత్తం కరోనా పరీక్షలు – 9,284 వీటితో కలిపి ఇప్పటి వరకు చేసినవి 2,01,158 వాటిలో రాష్ట్రానికి చెందిన పాజిటివ్ కేసులు 2064 (1.03 %) మరణాలు 47 (2.28 %).
జిల్లాల వారీగా కేసుల సంఖ్య
అనంతపురం : కొత్త కేసులు 3 , మొత్తం 118 , చికిత్స పొందుతున్న వారు 65 , డిశ్చార్జి అయిన వారు 49 , మరణించిన వారు 4 ;
చిత్తూరు : కొత్త కేసులు 11 , మొత్తం 142 , చికిత్స పొందుతున్న వారు 68 , డిశ్చార్జి అయిన వారు 74 , మరణించిన వారు లేరు ; ( చిత్తూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 3 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)
తూర్పు గోదావరి: కొత్త కేసులు 4 , మొత్తం 51 , చికిత్స పొందుతున్న వారు 16 , డిశ్చార్జి అయిన వారు 35 , మరణించిన వారు లేరు; (తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు వొచ్చిన 4 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)
గుంటూరు : కొత్త కేసులు 12 , మొత్తం 399 , చికిత్స పొందుతున్న వారు 166 , డిశ్చార్జి అయిన వారు 225 , మరణించిన వారు 8 ;
వైఏస్సార్ కడప : కొత్త కేసులు లేవు , మొత్తం 97 , చికిత్స పొందుతున్న వారు 41 , డిశ్చార్జి అయిన వారు 56 , మరణించిన వారు లేరు ;
కృష్ణా : కొత్త కేసులు 3 , మొత్తం 349 , చికిత్స పొందుతున్న వారు 133, డిశ్చార్జి అయిన వారు 202 , మరణించిన వారు 14 ;
కర్నూలు: కొత్త కేసులు 7 , మొత్తం 591 , చికిత్స పొందుతున్న వారు 277 , డిశ్చార్జి అయిన వారు 297 , మరణించిన వారు 17 ;
నెల్లూరు : కొత్త కేసులు లేవు , మొత్తం 111 , చికిత్స పొందుతున్న వారు 31, డిశ్చార్జి అయిన వారు 77 , మరణించిన వారు 3 ;
ప్రకాశం : కొత్త కేసులు లేవు , మొత్తం 63 , చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 60 , మరణించిన వారు లేరు ;
శ్రీకాకుళం: కొత్త కేసులు లేవు , మొత్తం 5 చికిత్స పొందుతున్న వారు 1 , డిశ్చార్జి అయిన వారు 4 , మరణించిన వారు లేరు ;
విశాఖపట్నం : కొత్త కేసులు లేవు , మొత్తం 66 , చికిత్స పొందుతున్న వారు 40 , డిశ్చార్జి అయిన వారు 25 , మరణించిన వారు 1 ;
విజయనగరం – కొత్త కేసులు లేవు , మొత్తం 4 , చికిత్స పొందుతున్న వారు 4 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ;
పశ్చిమ గోదావరి : కొత్త కేసులు లేవు, మొత్తం 68 , చికిత్స పొందుతున్న వారు 30 , డిశ్చార్జి అయిన వారు 38 , మరణించిన వారు లేరు ;
ఇతర రాష్ట్రాల వారు : కొత్త కేసులు 8 , మొత్తం 73 ,( ఒడిశా 8 , మహారాష్ట్ర 38 , గుజరాత్ 26, కర్ణాటక 1) చికిత్స పొందుతున్న వారు 73 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు.






