Chandrababu: ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారుకావాలి : చంద్రబాబు
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాష్ట్రంలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు సీఎం శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా (Annamaya District) చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో గృహ ప్రవేశాలను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు, భవిష్యత్తుకు భద్రత, పేదలకు తొలిసారి పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్ (NTR). కూడు, గూడు, దుస్తులు నినాదంతో పుట్టిన పార్టీ టీడీపీ. ఇళ్ల లబ్ధిదారులు అందరికీ అభినందనలు. మిగతా ఇళ్లు కూడా పూర్తి చేసి త్వరలో అప్పగిస్తాం. నిన్న ప్రకాశం జిల్లా కనిగిరిలో 97 పరిశ్రమలకు పునాది వేశాం. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి అని తెలిపారు.







