Ashwini Vaishnav: ఏపీలో భారీ పెట్టుబడి.. రూ.765 కోట్లతో
ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ స్కీం కింద దేశంలోని మూడు రాష్ట్రాల్లో రూ.5,500 కోట్ల పెట్టుబడితో ఏడు ప్రాజెక్టులు ఏర్పాటుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ (IT Department) ఆమోదముద్ర వేసింది. ఆ శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ (Ashwini Vaishnav) ఈ విషయాన్ని వెల్లడిరచారు. ఈ ఏడు ప్రాజెక్టుల్లో మొత్తం రూ.36,559 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారవుతాయని, 5,100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు (Jobs) లభిస్తాయని తెలిపారు. ఇందులో సైర్మా స్ట్రాటెజిక్ ఎలక్ట్రానిక్స ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రూ.765 కోట్ల పెట్టుబడితో మల్టీ లేయర్ ప్రింటెండ్ సర్క్యూట్ బోర్డు (పీసీబీ) తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఇందులో మొత్తం రూ.6,933 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారవుతాయి. 955 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.







