ఏపీ వాసులు ఏపీకే …
విదేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో దిగుతున్న ఆంధప్రదేశ్ వాసులకు హైదరాబాద్ క్వారంటైన్ బాధ తప్పింది. ఇక నుంచి వారందరినీ నేరుగా సొంత రాష్ట్రానికే తరలిస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్లో విమానం దిగిన వారిని హైదరాబాద్లోనే 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంచుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం నగరంలోని పలు 2-4 నక్షత్రాల హోటళ్లలో గదుల్ని (రెండు వారాలకు రూ.15 వేలు, రూ.30 వేల ప్యాకేజీలతో) బుక్ చేశారు. తాజాగా రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు కలిసి ఆంధప్రదేశ్ వాసులను ఆ రాష్ట్రానికే పంపేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇకపై శంషాబాద్కు రానున్న ఆంధప్రదేశ్ వాసుల్ని పరీక్షల అనంతరం నేరుగా ఆ రాష్ట్రానికే తరలిస్తారు. అక్కడ రెండు వారాలపాటు నగదు చెల్లింపు (పెయిడ్) కార్వంటైన్లో ఉంచిన తర్వాత ఇళ్లకు పంపిస్తారు. శనివారం అమెరికా నుంచి వచ్చిన 33 మంది ఆంధ్రావాసుల్ని ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలించినట్లు ఓ అధికారి వెల్లడించారు.






