Bangladesh Riots: బంగ్లాదేశ్ లో ఆటవిక రాజ్యం.. చేతులెత్తేసిన యూనస్ సర్కార్…!
బంగ్లాదేశ్ అల్లర్లు తీవ్రరూపు దాల్చాయి. ఇంకిలాబ్ ఉద్యమ నేత ఉస్మాన్ హాదీ హత్య తర్వాత అల్లర్లు విస్తృతమయ్యాయి. ముఖ్యంగా భారత వ్యతిరేకతను బంగ్లాదేశీయుల్లో పెంచాలని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నించింది. అల్లర్లను ప్రోత్సహించింది. మైనారిటీలు అయిన హిందువులపై దాడి చేయిస్తోంది. అయితే తాజాగా హాదీ హత్య వెనుక తాత్కాలిక ప్రభుత్వం ఉందన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. హాదీ సోదరుడు ఒమర్ .. నేరుగానే ప్రభుత్వంపై ఈ రకమైన ఆరోపణ చేశారు. పాలకులు రచించిన కుట్రగా చిత్రీకరించారు. దీని ద్వారా వచ్చే ఏడాది ఎన్నికలను ఆపేయాలనే ఉద్దేశమని ఆరోపించాడు. దర్యాప్తు వేగవంతం చేయాలని డిమాండ్ చేశాడు. హంతకులకు శిక్షించబడకపోతే పాలకులకు షేక్ హసీనా లాంటి పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.
అవామీ లీగ్ నిషేధం..
అవామీ లీగ్పై ప్రభుత్వం విధించిన నిషేధం 2026 ఎన్నికల్లో ఆ పార్టీ పాల్గొనే అవకాశం లేకుండా చేసింది. అవామీలీగ్ షేక్ హసీనాకు సంబందించిన పార్టీ. అయితే దీనిపై అమెరికా చట్టసభ్యులు తీవ్ర అసంతృప్తి తెలిపారు. అన్ని పార్టీలకు పోటీచేసే హక్కు ఉండాలని…ఎన్నికలు పారదర్శకంగా జరపాలని ఒత్తిడి తెచ్చారు.. నిషేధాన్ని పునః పరిశీలించాలని సూచించారు, ఇది యూనస్ పాలనకు అంతర్జాతీయ ఒత్తిడిని పెంచుతోంది.
మీడియాపై దాడుల పర్వం..
అస్థిరతలు మరింత ఊపందుకుంటున్న నేపథ్యంలో మీడియా సంస్థలపై దాడులు, బెదిరింపులు పెరుగుతున్నాయి. ఇటీవల పలు వార్తా సంస్థలు లక్ష్యంగా మారాయి. తాజాగా గ్లోబల్ టీవీ చీఫ్ నాజ్నిన్ మున్నీన్కు బెదిరింపు మెసేజ్లు వచ్చాయి. ఆమె తొలగించాలని.. ఎందుకంటే, నాజ్నిన్… అవామీలీగ్ సానుభూతి పరురాలని ఆరోపించారు దుండగులు.
హాదీ హత్యను ఎన్నికల రద్దుకు ఉపయోగించాలనే ఆరోపణలు యూనస్ ప్రభుత్వాన్ని కష్టాల్లోకి నెట్టాయి. షేక్ హసీనా పతనానికి కారణమైన హాదీ హత్య, మరో నాయకుడిపై హత్యాయత్నం లాంటి పరిణామాలు.. పాలకులపై మరింత ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో యూనస్ సర్కార్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.






