ఆర్బీఐ మాజీ గవర్నర్ కు కీలక పదవి!
రిజర్వ్ బ్యాంక్ ఇఫ్ ఇండియా గవర్నర్గా పని చేసిన ఊర్జిత్ పటేల్కి కీలక పదవి దక్కింది. ఊర్జిత్ పటేల్ను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వైఎస్ ప్రెసిడెంట్గా నియమించింది. ఏఐబీ వ్యవస్థాపక దేశాల్లో భారత్ కూడా ఉంది. షియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్లో ఉంది. చైనా తర్వాత రెండో అత్యధిక ఓటింగ్ వాటాతో ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ)లో భారత్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. ఏఐఐబీకి చైనా మాజీ ఆర్థిక శాఖ వైస్ మినిస్టర్ జిన్ లికున్ నాయకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 1న ఊర్జిత్ పటేల్ ఈ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో బ్రిటానియా కంపెనీలో ఉన్న పదవులకు ఆయన రాజీనామా సమర్పించారు. రిజర్వ్ బ్యాంక్కి 24వ గవర్నర్గా ఊర్జిత్ పేటల్ సేవలు అందించారు.






