Lok Sabha: లోక్సభలో కీలక ప్రకటన చేసిన కేంద్రమంత్రి!

ఉద్యోగుల పదవీ విరమణ వయసును మార్చే ప్రతిపాదనలు ఏమీ లేవని కేంద్ర మంత్రి జిత్రేందర్ సింగ్ (Jitendra Singh) వెల్లడించారు. లోక్సభ (Lok Sabha)లో ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఉద్యోగుల పదవీ విరమణతో ఉత్పన్నమయ్యే ఖాళీలను భర్తీ చేసే విధానం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసులో మార్పులు చేసే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల (Employees) సంఘాలు, సంస్థలు పదవీ విరమణ (Retirement) వయసులో మార్పులు చేయాలని కోరారా? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. జాతీయ మండలి ( జాయింట్ కన్సల్టేటివ్ మెకానిజం) సిబ్బంది వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదన్నారు.