Rahul Gandhi : ఇదంతా పచ్చి అబద్ధం..అలా చేస్తే దేశంలో

బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం స్వాతంత్రం పూర్వం నాటి పరిస్థితులను కోరుకుంటున్నాయని ఆరోపించారు. ప్రజలను మరోసారి బానిసలుగా మారుస్తున్నారని ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని మహులో నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) రాజ్యాంగంపై దాడికి పాల్పడుతున్నారు. బీజేపీ (BJP), ఆర్ఎస్ఎస్ (RSS) నుంచి కాంగ్రెస్ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది. దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం నాటి పరిస్థితులను బీజేపీ, ఆర్ఎస్ఎస్ మళ్లీ కోరుకుంటున్నాయి. దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు, పేదలను మరోసారి బానిసలుగా మారుస్తున్నాయి. రాజ్యాంగం మారిన రోజు ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అని వ్యాఖ్యానించారు. ప్రైవేటు వ్యవస్థలో విద్య, వైద్య రంగాల యాజమాన్యం ఎవరి చేతిలో ఉంది? మన భారత విద్యా రంగం స్టాంపులు, సర్టిఫికేట్ల వ్యవస్థగా మారింది. సర్టిఫికేట్లు వస్తే, ఉద్యోగాలు వస్తాయని కోట్లాది మంది ప్రజలు భావిస్తున్నారు. ఇదంతా పచ్చి అబద్ధం. అలా చేస్తే మీ పిల్లలు దేశంలో ఎలాంటి ఉపాధి పొందలేదు. ఈ బిలియనీర్లు దేశ ఉపాధి వ్యవస్థను నాశనం చేస్తున్నారు అని ఆరోపించారు.