Gold : 53 కేజీల బంగారం తుప్పు పట్టేస్తుంది … మా నగలు మాకిచ్చేయండి

ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు (Gold )నగలు తుప్పుపట్టిపోతాయంటూ గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy ) ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నగలతో పాటు తమ వద్ద సీజ్ చేసిన నగదు, రూ.5 కోట్ల విలువైన బాండ్ల (Bonds) ను విడుదల చేయాలంటూ గాలి జనార్దన్ రెడ్డి, ఆయన కుమార్తె జి.బ్రహ్మణి (G. Brahmani), కుమారుడు జి.కిరీటిరెడ్డి (G. Kiriti Reddy) పిటిషన్లు దాఖలు చేయగా, తెలంగాణ హైకోర్టు (High Court ) వాటిని కొట్టివేసింది. బంగారు నగలు తుప్పుపట్టిపోతాయని, విలువ తగ్గుతుందన్న గాలి అభ్యర్థనను తిరస్కరించింది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే వాటిపై హక్కులు తేల్చుకోవాలని స్పష్టం చేసింది.
అక్రమ మైనింగ్ ద్వారా రూ.884.13 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని సీబీఐ కేసు నమోదు చేసి, నేరపూరిత సొమ్ముతో కొన్న నగలపై ఈడీ కూడా హక్కులు కోరుతోందని, అందువల్ల ఈ దశలో సీజ్ చేసిన వాటిని అప్పగించాలని ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఓఎంసీ కేసు విచారణ పూర్తయ్యాకే నగలను, సొమ్మును తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చంది.