ఆ పదవి చేపట్టనున్న తొలి దళిత అధికారి

రైల్వే బోర్డు చైర్మన్-సీఈఓగా ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసు (ఐఆర్ఎంఎస్) అధికారి సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టనున్న తొలి ఎస్సీ అధికారి ఆయనే కావడం విశేషం. ప్రస్తుతం చైర్మన్గా ఉన్న జయ వర్మ సిన్హా ఈ నెల 31న పదవీ విరమణ చేసిన అనంతరం సతీష్ కుమార్ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. సతీశ్ ప్రస్తుతం ఆయన రైల్వే బోర్డు మెంబర్ (ట్రాక్షన్ `రోలింగ్ స్టాక్)గా ఉన్నారు.