Rahul Gandhi :పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి ఊరట లభించింది. ఈ కేసులో పుణె కోర్టు (Pune Court ) ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2023 మార్చిలో లండన్(London) లో జరిగిన ఓ కార్యక్రమంలో వి.డి.సావర్కర్ (V.D. Savarkar )ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రాహుల్పై సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పుణెలోని ఓ కోర్టులో పరువు నష్ట దావా దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి తాజా విచారణకు రాహుల్ గాంధీ వీడియో కాన్ఫారెన్స్ ద్వారా హాజరయ్యారు. దీంతో ఆయనకు రూ.25 వేల పూచీకత్తు బాండ్ పై ఎంపీ/ ఎమ్మెల్యే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీకి పూచీకత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ కోర్టు ముందు హాజరయ్యారు.