Municipal Elections: ఫిబ్రవరిలో పురపాలక ఎన్నికలు : మంత్రి ఉత్తమ్
ఫిబ్రవరి రెండో వారంలో పురపాలక ఎన్నికలు (Municipal elections) జరిగే అవకాశాలు ఉన్నాయని, త్వరలో షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్, జగిత్యాల జిల్లా మెట్పల్లి లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)ని గెలిపిస్తాయన్నారు. చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ ముందుకెళ్లాలని, టికెట్ ఎవరికి వచ్చినా అందరూ కలిసి పనిచేస్తే పార్టీ అన్ని మునిసిపాలిటీలను, కార్పొరేషన్లను గెలుచుకుంటుందని చెప్పారు. సర్వేల ఆధారంగా అభ్యర్థులకు టికెట్లు ఇస్తామని, పార్టీ గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. ఎక్కడాలేనివిధంగా తెలంగాణ (Telangana)లో పేదలకు సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






