ప్రధాని మోదీ వయనాడ్ పర్యటన ఖరారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేరళ పర్యటన ఖరారైంది. ఇటీవలే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి వయనాడ్ జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని మోదీ వయనాడ్ వెళ్లనున్నారు. ఆగస్టు 10వ తేదీన కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కేరళ బయల్దేరి వెళ్తారు. అక్కడ కన్నూర్లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి కొండచరియలు విరిగిపడిన ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం ప్రమాద బాధితుల్ని మోదీ పరామర్శించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి.