స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఆ రాష్ట్రం.. మహిళా ఉద్యోగులకు

స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఒడిశా ప్రభుత్వం మహిళలకు శభవార్త చెప్పింది. ఉద్యోగినుల కోసం ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని వెల్లడిరచింది. ఈ మేరకు కటక్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పార్వతి పరీదా ఈ కీలక ప్రకటన చేశారు. ఈ పాలసీ తక్షణమే అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళా ఉద్యోగులు ప్రతినెలా తమ రుతుక్రమంలో తొలి లేదా రెండో రోజు ఈ సెలవును తీసుకునేలా దీన్ని రూపొందించినట్లు తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సు కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు.