ప్రధాని మోదీతో మందకృష్ణ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఢిల్లీలో మోదీని కలిసిన మందకృష్ణ వర్గీకరణకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దాదాపు అరగంటపాటు మోదీతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోడంలో మోదీ వంద శాతం విజయం సాధించారన్నారు. రెండు రాష్ట్రాల్లో వర్గీకరణ త్వరితగతిన అమలయ్యేలా చూడాలని కోరారు.