Amit Shah: వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రక్షణ : అమిత్ షా

మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్ (Chhattisgarh) లోని దంతేవాడలో పర్యటించిన ఆయన రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన బస్తర్ పణ్డూమ్ (Bastar Pandoom) వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ బస్తర్ గిరిజనుల అభివృద్ధిని మావోలు ఆపలేరన్నారు. మార్చి 2026 నాటికి నక్సల్ సమస్య (Naxal problem ) అంతమవుతుందని అమిత్ షా ఉద్టాటించారు.
బస్తర్లో బుల్లెట్ కాల్పులు, బాంబు పేలుళ్ల రోజులు ముగిశాయి. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మావోయిస్టు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా మాలో భాగమే. ఏ మావోయిస్టు చనిపోయినా ఎవరిలోనూ సంతోషం లేదు. ఆయుధాలు అడ్డం పెట్టుకొని స్థానిక గిరిజనుల అభివృద్ధిని ఆపలేరు అని అమిత్ షా పేర్కొన్నారు. లొంగిపోయి అభివృద్ధిలో భాగమైన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి రక్షణ ఉంటుందన్నారు. గతేడాది మొత్తంగా 881 మంది మావోయిస్టులు లొంగిపోగా, ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 521 మంది లొంగిపోయినట్లు చెప్పారు.