లోక్సభలో కంగనా రనౌత్ తొలి ప్రసంగం… ఏం మాట్లాడరంటే?

లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పార్లమెంటులో తొలిసారి ప్రసంగించారు. మండిలో వివిధ కళారూపాలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. హిమాచల్లో కత్-కుని అనే హస్తకళ ఉంది. గొర్రె చర్మాన్ని జాకెట్లు, టోపీలు, శాలువాలు, స్వెటర్లు వంటి పలు రకాల దుస్తుల తయారీకి వినియోగిస్తారు. వీటికి విదేశాల్లో ఎంతో విలువా ఉన్నా, ఇక్కడ మాత్రం అంతరించిపోతున్నాయి. అందువల్ల వీటికి ప్రోత్సాహమిచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించాల్సిన అసవరం ఉంది. హిమాచల్లో జానపద సంగీతం, మరీ ముఖ్యంగా స్పితి, కిన్నౌర్, భర్మౌర్లోని గిరిజన సంగీతం, వారి జానపదం, కళారూపాలు కూడా అంతరించిపోతున్నాయి అని ప్రసంగంలో పేర్కొన్నారు. మండి ప్రజల తరపున మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు స్పీకర్కు కృతజ్ఞతలు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి కంగనా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.