ఆ దేశంతో చర్చలు జరిపే కాలం ముగిసింది… చర్యకు తప్పకుండా ప్రతిచర్య

పాకిస్థాన్ విషయంలో భారత్ వైఖరిపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు ఆ దేశంతో చర్చలు జరిపే కాలం ముగిసిందన్నారు. ఇకమీదట సానుకూలమైన ప్రతికూలమైనా పాక్ నుంచి వచ్చే చర్యకు తప్పకుండా ప్రతిచర్య ఉంటుందని స్పష్టం చేశారు.ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్ పాకిస్థాన్ అంశాన్ని ప్రస్తావించారు. పాకిస్థాన్ మనతో ఎలా వ్యవహరిస్తే, మనమూ అందుకు తగిన విధంగా బదులిస్తామని స్పష్టం చేశారు. పాకిస్థాన్తో పదే పదే చర్చలు జరిపే కాలం ముగిసింది. మన దేశం పట్ల పాకిస్థాన్ ఎలా వ్యవహరిస్తే మనం కూడా అందుకు తగిన విధంగా బదులిస్తాం. పాక్ నుంచి వచ్చే చర్య సానుకూలమైన ప్రతికూలమైనా తప్పకుండా ప్రతిచర్య ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా భారత్ ముందడుగు వేస్తుంది అని స్పష్టం చేశారు.